హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సౌరశక్తితో రీచార్జ్ చేసుకొనే బ్యాటరీలను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్(టీఐఎఫ్ఆర్) పరిశోధకులు రూపొందించారు. టీఐఎఫ్ఆర్లోని టీఎన్ నారాయణన్ ల్యాబ్కు చెందిన అమర్ కుమార్, సహచరులతో కలిసి ఫొటో సెన్సిటివ్ పదార్థాలతో కూడిన కాంపాక్ట్ లిథియం అయాన్ బ్యాటరీని తయారు చేశారు. వీటిని నేరుగా సౌరశక్తితో రీచార్జ్ చేసుకోవచ్చని తెలిపారు. సౌరశక్తిని చానెల్ చేయటానికి ఫొటోవోల్టాయిక్ కణాల ను ఉపయోగించారు. అది సౌరశక్తిని విద్యుత్తు శక్తిగా మార్చుతుంది. అవి బ్యాటరీల్లో రసాయన శక్తిగా నిల్వ అవుతాయి. ఆ శక్తిని ఎలక్ట్రానిక్ పరికరాలకు ఉపయోగించుకోవచ్చు.