సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (MSME) పరిశ్రమలకు చేరువయ్యేందుకు, వారికి అవసరమయ్యే రుణాలను మంజూరు చేసేందుకు అందుబాటులో ఉన్న ఉత్తమ పథకాలను MSME పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (TIF)లు సంయుక్తంగా “ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ క్యాంపైన్” ను
దండు మల్కాపురం గ్రామంలోని టీఐఎఫ్, ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో నిర్వహించాయి.
ఈ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ తేలి. సురేష్ చంద్ర, సైఫాబాద్ రీజినల్ హెడ్ కట్ట. శ్రీధర్ బాబు, సైఫాబాద్ సరళ్ హెడ్ గంటి. కమలాకర్, టీఎస్ఐఐసీ (TSIIC) యాదాద్రి జోనల్ మేనేజర్ ఓ.వీ.టి. శారద, మేనేజర్ నాగరాజు, టీఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కే. సుధీర్ రెడ్డి, సీనియర్ జాయింట్ సెక్రటరీ ఎం. గోపాల్ రావు, కోశాధికారి వై. సుధాకర్ రెడ్డి, యూనియన్ బ్యాంకు అబ్దుల్లాపూర్ మెట్ బ్రాంచ్ హెడ్, పీ.వై.గిరి, పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
టిఫ్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతిని, మౌలిక వసతులను స్వయంగా వీక్షించిన యూనియన్ బ్యాంకు ఉన్నత అధికారులు టిఫ్ గ్రీన్ పార్క్ను ఒక ప్రత్యేక ఎంఎస్ఎంఈ క్లస్టర్గా గుర్తించి అక్కడ యూనియన్ బ్యాంకు బ్రాంచ్ను ఏర్పాటు చేస్తామని, ఆ పార్కులోని పారిశ్రామికవేత్తలకు వీలయినంత తక్కువ వడ్డీ రేటుకు రుణాలను మంజూరు చేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎస్ఐఐసీ రూపొందించిన పోస్టర్ని అతిథులు ఆవిష్కరించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.