నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా (Nizamabad ) వర్షం కురుస్తున్నది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షం పడుతున్నది. అయితే అకాల వర్షాల వర్షంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటకు నష్టం కలిగిందని వాపోతున్నారు. బాన్సువాడ, బీర్కూరు మండల కేంద్రంలోని మార్కెట్లో రైతులు పంటను ఆరబెట్టగా వర్షానికి పూర్తిగా తడిసిపోయింది.
అకాల వర్షాలతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిముద్దయింది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళ చెందుకున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతలను ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కూడా శనివారం ఉదయం వర్షం కురిసింది.