ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం రొయ్యురు గ్రామ సమీపంలోని గోదావరి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రొయ్యూరు గ్రామానికి చెందిన దొంగిరి సందీప్, బెడిక సతీశ్, ఆకుదారి సాయి వర్ధన్ ఉగాది పండుగ సందర్భంగా గ్రామస్తులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరి నదికి వెళ్లారు.
నీటిలో దిగి స్నానం చేస్తుండగా ప్రవాహం అధికంగా ఉండడంతో గల్లంతైనట్లు సమాచారం. ప్రమాదంలో గల్లంతైన విద్యార్థులలో ఇద్దరు ఇంటర్మీడియెట్, మరో విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. గల్లంతైన వారి ఆచూకీకోసం అధికారులు గాలింపుచర్యలు చేపట్టారు.