కట్టంగూర్, జనవరి 8 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో 65వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణంలోని కిల్లా బజారుకు చెందిన 9 మంది యువకులు తమ స్నేహితుడి చెల్లి వలిమా (రిసెప్షన్)కు ఇన్నోవాలో శనివారం సాయంత్రం ఖమ్మం నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. రిసెప్షన్ అనంతరం ఆదివారం అర్ధరాత్రి తిరిగి కారులో ఖమ్మంకు తిరుగుపయనమయ్యారు.
మార్గమధ్యంలో తెల్లవారుజామున నల్లగొండ జిల్లా కట్టంగూరు సమీపంలో ఉన్న ఎరసానిగూడెం స్టేజీ వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న అర్షద్అలీ నిద్రమత్తులోకి జారుకోవడంతో అతివేగంగా ఉన్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇమిదాద్(21), ఎస్కే సమీర్(21), యాసిన్(18) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. సోహెల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు.