హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రైలులో ప్రయాణికుల ఆభరాణాల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళా ముఠా చిక్కింది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు మహిళలతో కూడిన ఈ ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన 78 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ క్రైమ్టీమ్ బీ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో రేణుకాయాదవ్ (ఏ1), అనుదేవ్ (ఏ2), సీతాబాయి (ఏ3)ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులు మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందినవారుగా గుర్తించారు.