హైదరాబాద్ : కర్నాటక జలపాతంలో పడి తెలంగాణకు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. కొడగు జిల్లా మదికేరిలోని అబ్బే జలపాతంలో నీటమునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కలకోటి శ్యామ్ (36), కక్కిరిణి శ్రీహర్ష (18), షాహీంద్ర (16)గా గుర్తించారు. వీరి స్వస్థలం సూర్యాపేట.
వారంతపు సెలవులు దినాలు కావడంతో పలువురు కుశాల్నగర్లో బస చేసి, అబ్బే జలపాతాన్ని చూసేందుకు వెళ్లినట్లుగా తెలుస్తున్నది. పలువురు జలపాతంలో స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినట్లుగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.