హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : ప్రతి కుటుంబానికీ ఇల్లు, ఇంటిపట్టా ఇవ్వాలనే నినాదంతో సీపీఐ, ఇతర వామపక్షాల పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడు తూ.. ప్రతి పేదవాడికీ ఇల్లు ఇవ్వాల్సిందేనని, అప్పటివరకు పోరుబాట ఆగదని తే ల్చిచెప్పారు.
పలు జిల్లాల్లో కార్యకర్తల ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, హనుమకొండ కలెక్టరేట్ వద్ద రాష్ట్ర సహాయ కార్యదర్శి టీ శ్రీనివాసరావు, పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, ఖమ్మం కలెక్టరేట్ వద్ద రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంతరావు, నల్లగొండ కలెక్టరే ట్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. గుడిసెవాసులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లా వాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.