హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మూడేండ్ల డిగ్రీ కోర్సుల్లోని విద్యార్థులు ఆసక్తి ఉంటే నాలుగేండ్ల డిగ్రీ కోర్సులోకి మారే అవకాశాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కల్పించింది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)లో మూడేండ్ల డిగ్రీ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇందుకు అర్హులని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ వెల్లడించారు. ఆయా విద్యార్థులు తమ వర్సిటీ నుంచి బ్రిడ్జి కోర్సులను పూర్తిచేయాల్సి ఉంటుందని తెలిపారు.
దేశంలో 200లకు పైగా విశ్వవిద్యాలయాలు నాలుగేండ్ల డిగ్రీ ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నాయి. యూజీ కోర్సుల్లోని వారు నాలుగేండ్ల డిగ్రీని పూర్తిచేస్తే వారిని ఆనర్స్ డిగ్రీని జారీచేస్తారు. ఈ సమయంలో విద్యార్థులు రీసెర్చ్ ప్రాజెక్ట్ను పూర్తిచేయాల్సి ఉంటుంది.