అంబర్పేట, అక్టోబర్ 3: రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల ఏసీబీ దాడుల్లో ముగ్గురు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. హైదరాబాద్ అంబర్పేట తహసీల్దార్ కార్యాలయ పరిధిలో తన తల్లి ప్లాటు రిజిస్ట్రేషన్ ఫైల్ తదుపరి ఉత్తర్వుల కోసం దాదుబాయి వెంకటేశ్వర్రావు అనే వ్యక్తి అధికారులను సంప్రదించారు.
ప్లాటు రిజిస్ట్రేషన్ విలువను రూ.80 లక్షల నుంచి రూ.60 లక్షలకు తగ్గిస్తామని, అందుకు తమకు రూ.10 లక్షలు ఇవ్వాలని స్పెషల్ ఆర్ఐ శోభ, సర్వేయర్ లలిత డిమాండ్ చేశారు.బాధితుడు వెంకటేశ్వర్రావు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు రూ.1.50 లక్షలను ఆర్ఐ, సర్వేయర్ పంపిన ప్రైవేటు వ్యక్తి ఎం బాపుయాదవ్కు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనితోపాటు ఆర్ఐ శోభను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సర్వేయర్ పరారీలో ఉన్నాడు.