హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి గేట్ వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఇందులో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి నుంచి పిట్లం నుంచి ట్రాలీ ఆటో వస్తున్నది. ఇదే సమయంలో పిట్లం నుంచి నిజాంసాగర్ వైపు లారీ వెళ్తున్న లారీ వేగంగా వచ్చిన ఢీకొట్టినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు భాన్సువాడ ఆసుప్రతికి తరలిస్తుండగా.. మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 26 మంది ఉన్నారు.
వీరంతా పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పలువురు తీవ్రంగా గాయపడగా వారిని ఎల్లారెడ్డి, భాన్సువాడ ఆసుపత్రుతలకు తరలించారు. బాధితులంతా ఆదివారం ఎల్లారెడ్డిలో జరిగే సంతకు వచ్చి వెళ్తున్న సమయంలోనే లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మృతి చెందిన వారిని లచ్చవ్వ, దేవయ్య, కంసవ్వ, కేశయ్య, డ్రైవర్ సాయిలుగా గుర్తించారు. లారీ వేగంగా వచ్చిన ఢీకొట్టడంతో డ్రైవర్ సాయిలు మృతదేహం ఆటోలోనే ఇరుక్కుపోయింది. కట్టర్లు వినియోగించి మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.