హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టులో అదనపు జడ్జీలుగా పనిచేస్తున్న జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి, జస్టిస్ సుజన కలసికంలను పర్మినెంట్ న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.
2023 జూలై 31న అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టిన ఈ ముగ్గురినీ శాశ్వత న్యాయమూర్తుల నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఆ ముగ్గురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటలకు మొదటి కోర్టు హాలులో తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ వీరితో ప్రమాణం చేయించనున్నారు.