నల్లగొండ : నకిలీ బంగారం(Fake Gold) అసలుగా నమ్మించి మోసగించిన ముగ్గురు రాజస్థాన్కు చెందిన నిందితులను నల్లగొండ పోలీసులు(Nallagonda Police) అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. రెండు లక్షల నగదు, ఐదు ఒరిజినల్ బంగారు బంతులు, నాలుగు సెల్ ఫోన్లు, మూడు కేజీల బరువున్న నకిలీ బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అపూర్వరావు( Superintentend of Police) తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
జిల్లాలోని పీఏ పల్లి మండలం అంగడిపేటకు చెందిన ఎం. ధర్మరాజు, కొండమల్లపల్లికి చెందిన పూరి శేషయ్య అనే వ్యక్తులు తాము బంగారం కొనుగోలు చేసి మోసపోయామని కొండమల్లపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. రాజస్థాన్(Rajasatan)కు చెందిన పంచారామ్, గులాబ్రామ్, ఉమారామ్ అనే ముగ్గురు అంగిపేట గ్రామంలోని ఎం. ధర్మరాజు కిరాణ దుకాణానికి వెళ్లి వెండి నాణెం, బిళ్ళలను చూపించి వాటిని కొనుగోలు చేయాలని కోరారు. దీంతో అతడు నిరాకరించాడు.
మరుసటి ఈ ముగ్గురు నిందితులు మరోసారి దుకాణం వద్దకు వచ్చి తమకు గుంటూరులో కూలి పనిచేస్తుండగా భూమిలో కిలోన్నర బంగారు హారం దొరికిందని చూపించారు. ముందుగా రెండు ఒరిజినల్ బంగారు బంతులను బంగారు హారం నుంచి తీసి ధర్మరాజుకి చూపించారు. అతడు బంగారు బంతులను చెక్ చేయించగా అవి నిజమైన బంగారమని తేలింది. ధర్మరాజు మొబైల్ నంబరుకు నిందితులు ఫోన్ చేసి రూ. మూడు లక్షలతో దేవరకొండకు రమ్మని తెలిపారు. ధర్మరాజు అతడి భార్య ఇద్దరు కలిసి దేవరకొండకు వెళ్లి నగదును నిందితులకు అందజేయగా వారు బంగారం అప్పగించి వెళ్లిపోయారు. వాటిని దంపతులు ఇంటికి వెళ్లి పరీక్షించగా నకిలీదిగా తేలడంతో లబోదిబోమంటూ కొండమల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నిందితులే కొండమల్లపల్లిలో పూరీ శేషయ్య అనే వ్యక్తిని మోసం చేసేందుకు ప్రయత్నించగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిజాన్ని అంగీకరించడంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు.