హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ముగ్గురు సీనియర్ ఐఏఎస్ (1991 బ్యాచ్) అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావును, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టుల్లో నియమించింది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అడిషన్ డైరెక్టర్ జనరల్ హర్ప్రీత్సింగ్కు పదోన్నతి కల్పిస్తూ అదే హోదాలో కొనసాగించింది.