హైదరాబాద్: నగర శివార్లలోని ఘట్కేసర్ (Ghatkesar) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ పరిధిలోని అవుషాపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ యువతి, ఇద్దరు యువకులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.