ముదిరాజ్, ముత్రాసి, తెనుగుకు చోటు
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, జూలై 4(నమస్తే తెలంగాణ): మత్స్యసొసైటీల్లో ముదిరాజ్, ముత్రాసి, తెనుగు కులాలను ప్రభుత్వం చేర్చింది. ఈ కులాలు నైపుణ్య శిక్షణకు అర్హులుగా పేర్కొన్నది.
ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో మత్స్య సొసైటీల సభ్యత్వ జాబితాలో ఇప్పటివరకు 30 కులాలుండగా ఈ సంఖ్య ఇప్పుడు 33కు చేరింది. అనంతరామన్ కమిషన్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నివేదికల ఆధారంగా మత్స్యశాఖ ఈ మూడు కులాలకు జాబితాలో చోటు కల్పించింది.