హైదరాబాద్ : మలక్పేట(Malakpet) అక్బర్బాగ్లోని గల కిస్వాక్ నగల దుకాణం(Jewelery shop)లో దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్(Accused arrested) చేశారు. వారి వద్ద నుంచి రూ.24 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ నెల 14న కిస్వాక్ నగల దుకాణం దుకాణం యజమానిని కత్తితో బెదరించి బంగారం(Gold) నగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. యజమాని మహ్మద్ ఉల్ రహమాన్ తన కుమారుడు సజావల్ రహమాన్ను దుకాణంలో ఉంచి.. భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లాడు.
ఆ సమయంలో మాస్క్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి దుకాణానికి వచ్చి.. బంగారు గొలుసు కావాలని అడిగాడు. జావల్ రహమాన్ గొలుసు చూపిస్తుండగా, అతడు ఒక్కసారిగా కత్తితో గాయపరిచాడు. అంతలోనే మాస్క్.. హెల్మెట్ ధరించిన మరో ఇద్దరు వ్యక్తులు దుకాణంలోకి చొరబడ్డారు. 150 గ్రాముల ఆభరణాలను దోచుకొని నిందితులు పారిపాయారు.సంఘటనా స్థలాన్ని తూర్పు మండలం డీసీపీ జానకి ధరావత్ పరిశీలించారు.