హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతుండ టం, ఒమిక్రాన్ ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరి కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు కోరా రు. మాస్క్ పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా వేయాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాల ని పోలీస్శాఖను కోరినట్టు చెప్పారు. శ్రీనివాసరావు గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రప్రభు త్వ ఆదేశాల మేరకు 11 దేశాల నుంచి వచ్చిన ప్ర యాణికులందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదనంగా ఇతర దేశాల నుంచి వచ్చేవారిలో 2 శాతం మంది శాంపిళ్లను సేకరించి పరీక్షలు జరుపుతున్నామని తెలిపారు. బుధవారం బ్రిటన్, సింగపూర్ నుంచి వచ్చిన 325 మందికి పరీక్షలు చేయగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన 35 ఏండ్ల మహిళకు పాజిటివ్ రావటంతో టిమ్స్లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. శాంపిల్ను జీనోమ్ సీ క్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపామని, నివేదిక వచ్చిన తర్వాతే డెల్టా వేరియంటా? ఒమిక్రాన్ వేరియంటా? అనేది తేలుతుందని పేర్కొన్నారు.
ఎవరికివారు అప్రమత్తంగా ఉండండి
ఒమిక్రాన్ వైరస్ దేశంలోకి వచ్చినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాసరావు కోరారు. కొత్తవేరియంట్ను నియత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తేనే ముప్పుతప్పుతుందని స్పష్టం చేశారు. మాస్కులు ధరించటం, భౌతికదూరం పాటి ంచటం మరువకూడదని కోరారు. వ్యాక్సిన్లు ప్రాణాలను రక్షిస్తాయని నిరూపణ అయిన నేపథ్యంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. చలికాలం ఫ్లూ వైరస్కు అనుకూలంకావటంతో ఇటీవల స్వల్పంగా కరోనా కేసు లు పెరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 25 లక్షల మందికిపైగా గడువు పూర్తయినా రెండో డోస్ టీకా తీసుకోలేదని, వీరిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 15 లక్షల మంది ఉన్నారని తెలిపారు. ఈ నెలాఖరులోగా అందరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకొంటున్నామని, ఆవాసం యూనిట్గా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 80 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అన్నిరకాల పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాలు చేస్తున్నప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ వెంట తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొన్నారు. ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి, కొత్త వేరియంట్ తయారుకాదని శ్రీనివాసరావు అన్నారు.
కరోనా థర్డ్వేవ్కు మందు ఇస్తా: ఆనందయ్య
కరోనా థర్డ్వేవ్కు కూడా మందు ఇస్తానని ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గురువారం ప్రకటించారు. గతంలో ప్రభుత్వం సహకరించలేదని, అయినా దాతల సాయంతో లక్ష మందికిపైగా కరోనా రోగులకు, 70 నుంచి 80 లక్షల మందికి ముందస్తు మందు పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తే అందరికీ మందు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ వివరాలు
రాష్ట్రంలో మొదటి డోస్ తీసుకొన్నవారు 90 శాతం.
రెండో డోస్ వేసుకున్నవారు 47 శాతం.
రెండో డోస్ వేసుకోనివారు 25 లక్షలు.
హైదరాబాద్లో రెండో డోస్ వేసుకోనివారు 5.90 లక్షలు
మేడ్చల్ జిల్లాలో రెండో డోస్ వేసుకోనివారు 4.80 లక్షలు
రంగారెడ్డి జిల్లాలో రెండోడోస్ వేసుకోనివారు 4.15 లక్షలు
హైదరాబాద్లో ఒమిక్రాన్ భయాలు!
జీహెచ్ఎంసీలో నిబంధనలు కఠినతరం
ఒమిక్రాన్ భయాలు హైదరాబాద్లోనూ కలకలం రేపుతున్నాయి. బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ మరిం త అప్రమత్తమైంది. గ్రేటర్ హైదరాబాద్లో కరోనా నిబంధనలను కఠినతరం చేశారు. మాస్కు ధరించని వారికి రూ.వెయ్యి జరిమాన విధించనున్నట్టు పోలీసుశాఖ ప్రకటి ంచింది. దవాఖానలు, ఇతర ఆరోగ్య కేం ద్రాల్లో మాస్కు ధరించని రోగులు, వారి సహాయకులను అనుమతించబోమని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.
సూర్యపేట డీఎంహెచ్వోకు పాజిటివ్
సూర్యపేట డీఎంహెచ్వో కోటాచలంకు కరోనా సోకింది. జర్మనీలో ఉంటున్న ఆ యన చిన్నకుమారుడు కొద్దిరోజుల క్రితం సూర్యపేట వచ్చారు. డీఎంహెచ్వోతోపా టు కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్ ని ర్ధారణ అయ్యింది. వీరిలో ఎవరికీ ఒమిక్రా న్ లక్షణాలు లేనప్పటికీ, జర్మనీ నుంచి వ చ్చిన వ్యక్తి శాంపిల్ను జీనోం టెస్ట్కు పంపిస్తున్నట్టు ఇంచార్జి డీఎంహెచ్వో డాక్టర్ హ ర్షవర్ధన్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలోని బీసీ గురుకుల పాఠశాలలో 27 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని కేజీబీవో లో ముగ్గురు కరోనా బారినపడ్డారు.