హైదరాబాద్ : కష్టపడి పనిచేసే వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ కచ్చితంగా గుర్తిస్తారు. పార్టీ ఆదేశాల ప్రకారం నిబద్ధతతో పనిచేసే వ్యక్తి మెట్టు శ్రీనివాస్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్(RDC) చైర్మన్ గా మెట్టు శ్రీనివాస్ ఎర్రమంజిల్లోని రోడ్లు-భవనాలు శాఖ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు మంత్రి ఎర్రబెల్లి , వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తాత మధు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి,అరూరు రమేశ్, స్త్రీ సాధికార సంస్థ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత,ఎడమ కృష్ణా రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గాయత్రి రవి, కొండ దేవయ్య, ఆర్ అండ్ బి ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, పలువురు అధికారులు, తదితరులు హాజరై మెట్టు శ్రీనివాస్ కి శుభాకంక్షలు తెలియచేసి,అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..రాజకీయాల్లో ఓపిక అవసరం అన్నారు. ఐదేండ్ల కింద 10 వేల మందితో మెట్టు శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరారన్నారు. సమయం వచ్చినప్పుడు పార్టీ అందరిని గుర్తించి అవకాశాలను కల్పిస్తుందన్నారు.