హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘డబ్బు కోసం మా ఆత్మగౌరవం తాకట్టు పెట్టం.. మరోసారి వస్తే చెప్పుతో కొడతాం’.. ధనమదంతో బీజేపీ పంపిన దళారులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘాటు సమాధానం ఇది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నితే.. ప్రలోభ పెట్టాలని ప్రయత్నిస్తే.. ఎమ్మెల్యేలు మాత్రం క్రమశిక్షణ గల టీఆర్ఎస్ కార్యకర్తలుగా, నాయకులుగా వ్యవహరించారు. ఓటుకు నోటుతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని నాడు చంద్రబాబు కుట్ర పన్నినా.. వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వాన్ని కూలదోయాలని మోదీ, అమిత్ షా విష పన్నాగం పన్నినా వారి ఆటలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సాగనివ్వలేదు. బీజేపీ విషపు కుట్రను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే పసిగట్టారు. దళారుల ముఠా ఏ ఎమ్మెల్యేను, ప్రజా ప్రతినిధిని కలిసినా వెంటనే సీఎం కేసీఆర్కు, పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వివరిస్తూనే ఉన్నారు. చివరికి ‘చెప్పుతో కొట్టినట్టు’ దళారులను రెడ్ హ్యాండెడ్గా పట్టించారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని రక్షించడం ఇది రెండోసారి. నాడు చంద్రబాబు నాయుడు ఓటుకు నోటుతో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తే.. ఇప్పుడు మోదీ-షా కలిసి రాష్ర్టాన్ని ఏకంగా హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించారు. ఈ రెండింటినీ కేసీఆర్ తనదైన వ్యూహంతో తిప్పికొట్టారు. 2015లో రేవంత్రెడ్డి ద్వారా రూ.5 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే.. ఎమ్మెల్యే స్టీఫెన్సన్ సీఎంకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు సైతం పలువురు ఎమ్మెల్యేలను దళారులు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించగా వెంటనే ‘చెప్పుతో కొడతాం’ అని చెప్పి.. ఆ విషయాన్ని సీఎంకు వివరించారు. వ్యక్తిగతంగా తను ఎన్ని తిట్టినా పట్టించుకోను.. కానీ తెలంగాణ జోలికి వస్తే మాత్రం ఊరుకోను అనేది సీఎం కేసీఆర్ ైస్టెల్. ఇది రాష్ట్రంలోని ప్రతి ఒకరికీ తెలుసు. ఆయన మార్గనిర్దేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా తెలంగాణపై అచంచల విశ్వాసాన్ని, విధేయతను ప్రదర్శిస్తున్నారని తెలంగాణవాదులు పేర్కొంటున్నారు.