సంగారెడ్డి: భూమిపై పచ్చదనం, భూమి లోపల పచ్చిదనం.. ప్రకృతి మెచ్చింది, పక్షులు మనసుపడ్డాయి. అందుకే వేల కిలోమీటర్లు దాటి తెలంగాణకు వలస వచ్చాయి.. గ్రేలాగ్ గీస్ పక్షులు.సాధారణంగా యూరప్లో ఎక్కువగా కనిపించే ఈ పక్షులు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ ట్యాంక్బండ్ వద్ద చేరిపోయాయి. దాదాపు 50 దాకా పక్షులు ఒకేచోట చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఈ రమణీయ దృశ్యాన్ని వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్లు శ్రీరాంరెడ్డి,
ఆర్ గోపాలకృష్ణ తమ కెమెరాల్లో బంధించారు. సాధారణంగా శీతాకాలంలో ఈ పక్షులు ఉత్తర భారతదేశానికి వలస వస్తుంటాయని, దక్షిణ భారతదేశానికి వలస రావటం బహుశా ఇదే మొదటిసారి అని తెలిపారు. –