యాదాద్రి, డిసెంబర్ 6 : యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహ స్వామి వారి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. మంగళవారం సాయంత్రం ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించారు. స్వామివారికి గరుడ వాహన, అమ్మవారికి తిరుచ్చి వాహన సేవ నిర్వహించారు.
తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం, తిరువారాధన చేపట్టారు. సాయంత్రం స్వామివారికి దర్బార్ సేవ, స్వామివారి పలు వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని 14 వేల మంది భక్తులు దర్శించుకోగా, ఖజానాకు రూ.37,94,693 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.