మెదక్ : మెదక్ జిల్లా చేగుంట(Chegunta) మండల కేంద్రంలో పట్టపగలు దోపిడీ దొంగలు(Thieves) హల్ చల్ చేశారు. చేగుంట సీతారాం నగర్ కాలనీలోని ఇంటిముందు కారు అద్దాలు(Car windows) ధ్వంసం చేశారు. కారులో ఉన్న రూ.5 లక్షలను(five lakhs) గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి యూనియన్ బ్యాంక్లో డబ్బులు డ్రా చేశాడు.
అనంతరం ఇంటి ముందు కారు ఆపి టీ తాగడానికి ఇంట్లోకి వెళ్లాడు. ఇదే సమయంలో గుర్తు తెలియని నలు గురు దుండగులు వచ్చి అందరు చూస్తుండగానే కారు అద్దాలు ధ్వంసం చేసి అందులో ఉన్న ఐదు లక్ష రూపాయలు దోచుకెళ్లారు. బాధితుడు విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీల ఆధారంగా త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.