హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో (Mailardevpally) ఏటీఎం చోరీ యత్నం విఫలమయింది. మైలార్దేవ్పల్లిలోని శ్రీరామ్నగర్ కాలనీలో ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో ఓ దొంగ చొరబడ్డాడు. ఏటీఎం మెషిన్ను ఇనుప రాడ్డుతో ధ్వంసం చేశాడు. అయితే అలారం మోగడంతో దుండగుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏటీఎం కేంద్రం పరిసరాలను, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.