కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో దొంగలు బీభత్సం సృష్టించారు. సింగణిలోని జేకే 5 ఓపెన్కాస్ట్ గనిలో సెక్యూరిటీ అధికారి రమణారెడ్డిపై దొంగలు రాళ్లతో దాడి చేశారు. ఆదివారం రాత్రి బేస్ క్యాంపులో ఐదుగురు దుండగులు దొంగతనానికి వచ్చారు. ఈ క్రమంలో వారిలో ఒకరిని రమణారెడ్డి పట్టుకున్నారు. ఈ క్రమంలో దుండగుడు అధికారిపై రాళ్లతో దాడిచేశాడు. దీంతో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. తోటిసిబ్బంది ఆయనను దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలనికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.