జడ్చర్ల టౌన్, ఆగస్టు 27 : మహిళలు కన్నీరు పెడితే ఎవరికీ మంచిదికాదని, ఆ కన్నీటి సునామీలో అందరూ కొట్టుకుపోతారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ ఇష్యూపై ఎవరూ మాట్లాడవద్దని సీఎం రేవంత్రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. సురేఖ ఇష్యూపై క్రమశిక్షణ కమిటీ విచారణ చేసి రిపోర్టు ఇచ్చిందని, ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
జడ్చర్ల సెగ్మెంట్లో బిల్లులు లేక రోడ్లు, మరికొన్ని అభివృద్ధి పనులు నిలిచిపోయాయని చెప్పారు. బిల్లుల కోసం డిప్యూటీ సీఎం భట్టితో కొట్లాడుతానని, అవసరమైతే దీక్ష చేస్తానని స్పష్టం చేశారు.