KTR | రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చిచండం చేతగాక తమపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బుధవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు ముందు మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ.. మా ఫొటోలను ఏఐ ఉపయోగించి మార్ఫింగ్ చేసి వాడుతున్నారని అన్నారు. ఫొటోల మార్ఫింగ్పై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే కేటీఆర్, హరీశ్రావుపై కేసుల పరంపర కొనసాగుతోంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీషర్ట్లు విప్పారని మహిళా కానిస్టేబుల్తో రేవంత్ ప్రభుత్వం ఫిర్యాదు చేయించింది. ఈ మేరకు వారిపై కేసులు పెట్టించింది.