జనగామ : బీజేపీ వాళ్లకు మెంటల్. వాళ్లు కావాలనే మనల్ని తికమక పెడుతున్నారు. ప్రతి దానికి వంక పెడుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కేంద్రం వరి ధాన్యం వద్దంటే, రాష్ట్రంలో బీజేపీ నాయకులు వేయమంటారు. ఇదెక్కడి ఉన్మాదం? అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. తెలంగాణ యాసంగి ధాన్యం మొత్తాన్ని పంజాబ్ తరహాలో కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ సన్నాహక సమావేశం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగింది.
ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాఆరు. బీజేపీ వాళ్లకు మెంటల్గా ప్రవర్తిస్తున్నారు. గ్రామాల్లోకి వారిని రాకుండా అడ్డుకోవాలన్నారు. మొన్నటిదాకా కొనమని చెప్పిన కేంద్ర మంత్రి ఇప్పుడు రా రైస్ కొంటమని చెబుతున్నారు. ఇగ రైస్, గిస్ జాంతా నహీ. కొంటె మొత్తం వడ్లే కొనాలి. పంజాబ్ ల కొని ఇక్కడ ఎందుకు కొనరు? అని మంత్రి ఎర్రబెల్లి కేంద్రాన్ని ప్రశ్నించారు. డొంక తిరుగుడు, అబద్ధాల బీజేపీ పై పోరాటం ఆపొద్దు.
కాజీపేట coach factory రానే రాలేదు. ఇవ్వం పో అంటున్నారు. గిరిజన యూనివర్సిటీ ఇవ్వరు.
బయ్యారం ఉక్కు పరిశ్రమ అటక ఎక్కింది. ఎన్నికల కోసం మొన్నటిదాకా పెంచని పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయన్నారు. ఇది కేంద్ర వైఖరికి నిదర్శనమన్నారు. ధాన్యం మొత్తం కేంద్రం కొనాలి. ఆ నినాదం నిజమయ్యే దాకా కొట్లాడాలని ప్రజలకు పిలుపున్చిచ్చారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ,. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎడవెల్లి కృష్ణా రెడ్డి, లింగాల ఘనపూర్ జెడ్పీటీసీ గుడి వంశీ ధర్ రెడ్డి, చేవెల్లి సంపత్, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇంచార్జీల సన్నాహక సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. బీజేపీ దురాగాతాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే వేరకు ఉద్యమించాలన్నారు.