హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు. లోక్ చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురు ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. మహిళా బిల్లుకు మద్దతుగా ఓటు వేయకుండా తప్పించుకొన్నారు. వీళ్లు వెళ్లింది మరెక్కడికో కాదు.. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక పంచాయితీకి. ఓవైపు లోక్ చరిత్రాత్మకమైన బిల్లుపై ఓటింగ్ జరుగుతుంటే.. తమకేమీ సంబంధం లేదన్నట్టుగా ఈ ముగ్గురు ఎంపీలు ఓటు వేయకుండా బయటకు వెళ్లిపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ ఎంపీలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్షమాపణ చెప్పాకే అడుగుపెట్టండి: దాసోజు
చరిత్రాత్మక మహిళా బిల్లుకు మద్దతుగా ఓటు వేయకుండా కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ ఉత్తమ్ కుమార్ మహిళా లోకానికి తీరని అన్యాయం, నమ్మకద్రోహం చేశారని బీఆర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. వీరంతా తమ విధులను నిర్వర్తించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి నమ్మిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. టికెట్ల పంచాయితీలో కొట్లాడుకుంటూ ఓటు వేయకుండా మహిళల పట్ల బాధ్యతలేకుండా వ్యవహరించారని దుయ్యబట్టారు. మహిళలకు క్షమాపణ చెప్పేవరకు వారిని తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనివ్వొద్దని అన్నారు.
మహిళలంటే కాంగ్రెస్ చులకన: మేడె రాజీవ్
మహిళలను కాంగ్రెస్ పార్టీ చులకన భావంతో చూస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ మండిపడ్డారు. పార్లమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో టీ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ బిల్లు ఓటింగ్ వచ్చినప్పుడు ఓటు వేయకుండా దొడ్డిదారిలో బయటకు వచ్చారని విమర్శించారు. గతంలో కూడా రాజ్యసభలో బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. అలాంటి కాంగ్రెస్ నేడు మహిళలకు గృహలక్ష్మి పేరుతో 2,500 ఇస్తామంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
మహిళా బిల్లుకు టీ కాంగ్రెస్ మద్దతు లేదా?
మహిళా బిల్లుకు తెలంగాణ కాంగ్రెస్ వ్యతిరేకమా? అందుకే ఆ పార్టీ ఎంపీలు ఓటింగ్ దూరంగా ఉన్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మహిళాభివృద్ధి కోసం ఇస్తున్న హామీలకు, చేసే పనులకు సంబంధం లేకుండా పోయిందని మహిళలు మండిపడుతున్నారు. ఓవైపు మహిళా ఓట్లను దండుకొనేందుకు ఎన్నికల వరాలను గుప్పిస్తున్న ఆ పార్టీ.. మరోవైపు రాజకీయాల్లో మహిళలకు అందలం ఎక్కించే బిల్లుకు మాత్రం మద్దతు ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ టికెట్ల పంచాయితీ కోసం మహిళా బిల్లుపై ఓటేయకుండాజారుకోవడమేంటని మహిళాలోకం భగ్గుమంటున్నది. తమ అభివృద్ధికి దోహదపడే బిల్లుకు మద్దతివ్వకుండా.. తమను ఏ విధంగా ఓట్లు అడుగుతారని నిలదీస్తున్నారు.