మహబూబ్నగర్ : ఫీవర్ సర్వేలో భాగంగా సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లినప్పుడు ఒక్కొక్కరిని థర్మల్ స్కానర్ తో టెంపరేచర్ చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ పట్టణంలోని పలు కాలనీలలో ఫీవర్ సర్వేను తనిఖీ చేశారు. ఝాన్సీ నగర్, హనుమాన్ నగర్ లలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న బృందాల పనితీరును ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేశారు.
కాలనీ వాసులతో కలెక్టర్ సర్వే గురించి అడిగి తెలుసుకున్నారు. సర్వే బృందాలు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారా.. ఎలాంటి వివరాలు అడుగుతున్నారు.. జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారా..మీరందరూ పూర్తి వివరాలను సర్వే బృందానికి ఇస్తున్నారా? అని కలెక్టర్ వారిని అడిగారు. ఎవరికైనా దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలుంటే సర్వే బృందానికి తెలియజేయాలనిచెప్పారు.
ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సర్వే నిర్వహించాలని, అనుకున్న సమయంలో సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శశికాంత్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం : మంత్రి ఎర్రబెల్లి
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్
చెక్ డ్యామ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే