హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా బయ్యారం(Bayyaram)లోని మీ సేవ(Mee seva center) కేంద్రంలో చోరీ(Robbery )జరిగింది. మీ సేవ వెనుక భాగంలోని షట్టర్ను కట్ చేసి దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సెంటర్లోని నగదు, కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు. ఉదయం షట్టర్ తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని గుర్తించిన బాధితుడు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.