న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అసహనం వ్యక్తంచేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని చెప్పారు. ఇది రాజకీయ కేసు అని, తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసన్నారు. తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని తెలిపారు. కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిథులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు.
ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని కవిత తరఫు నాయ్యవాది కోర్టుకు తెలిపారు. కస్టడీ పూర్తయిన రోజే బెయిల్ పిటిషన్పై విచారణ జరపాలని కోరారు. బెయిల్ పిటిషన్పై ఈడీకి నోటీసులు ఇవ్వాలన్నారు. కవిత పిల్లలు మైనర్లని, వారిని కలిసేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు.
కాగా, మరో ఐదురోజులపాటు కస్టడీ పొడిగించాలని ఈడీ తరపు లాయర్లు న్యాయస్థానాన్ని కోరారు. కేసులో ఉన్న మరికొన్ని అంశాలపై విచారణ జరపాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నలుగురి స్టేట్మెంట్లతోపాటు కిక్ బ్యాగ్స్ గురించి కవితను అడిగామని చెప్పారు. లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయలు చేతులుమారయన్నారు. డాక్టర్ల సూచనతో కవితకు మందులు, డైట్ ఇస్తున్నామని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వులో ఉంచారు.
#WATCH | Excise Policy Money Laundering case | At Rouse Avenue Court of Delhi, BRS MLC K Kavitha says. “…This is an illegal arrest. We are going to fight it out in court. It is a political case, a fabricated case, a false case. We are fighting it out. There is nothing new, they… pic.twitter.com/WkZfE8Tidl
— ANI (@ANI) March 23, 2024