కొత్తపల్లి/హుజూరాబాద్టౌన్/మంథని, ఫిబ్రవరి 10: దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శనివారం సంబురాలు జరుపుకొన్నారు. కరీంనగర్లో టీఎన్జీవోస్ కేంద్రం సంఘం కార్యదర్శి మారం జగదీశ్ నేతృత్వంలో నాయకులు స్వీట్లు పంచిపెట్టారు.
సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హుజూరాబాద్ అంబేద్కర్ పీవీ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పా టు చేశారు. జగిత్యాలలో బీజేపీ నాయకులు పీవీ చిత్రపటంవద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పీవీ విగ్రహానికి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు.