హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఏఎంలతోపాటు సెంట్రల్ వర్సిటీలతోపాటు 200పైగా విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన ప్రతిభావంతులైన బీసీ విద్యార్థుల ఫీజును ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ‘స్వదేశీ విద్యానిధి’ పథకాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంపై ఆనందం వెల్లివిరుస్తున్నది. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు బీసీ సంఘాల నేతల నుంచి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఏటా వేలాది మంది బీసీ బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలు దక్కనున్నాయని వెల్లడించారు.
బీసీలకు ఉన్నత విద్యావకాశాలు
బీసీల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం. స్వదేశీ విద్యానిధితో 10 వేల మంది బీసీ విద్యార్థులకు ఏటా లబ్ధి చేకూరనున్నది. ఫీజు చెల్లించలేక గతంలో ఎంతో మంది ఉన్నత విద్యకు దూరమయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఉన్నత విద్యనభ్యసించే గొప్ప అవకాశం బీసీ బిడ్డలకు లభించనున్నది. అందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. జ్యోతిరావు ఫూలే ఆశయాలను ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారు.
– కిశోర్గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు
బడుగులకు బాసటగా..
తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అన్నివేళలా బాసటగా నిలుస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా బడగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తున్నది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బీసీ ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తున్నది. రాష్ట్రంలో కనీవినీ ఎరగని రీతిలో బీసీ విద్యార్థులకు సకల వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నది. స్వదేశీ విద్యానిధి పథకం అపూరూపం.. అద్వితీయం..
– రాచమల్ల బాలకృష్ణ, నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు
విద్యార్థులకు గొప్ప అవకాశం
‘స్వదేశీ విద్యానిధి’ బీసీ విద్యార్థులకు గొప్ప అవకాశం. విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన బీసీ విద్యార్థులకు ప్రభుత్వమే పూర్తి ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు నా ధన్యావాదాలు. ఈ పథకంతో బీసీ విద్యార్థులు లబ్ధి పొందడమేగా, రాబోయే రోజుల్లో బీసీ సమాజం నుంచి ఉన్నత విద్యావంతులు తయారవ్వడానికి ఇది ఎంతో దోహదపడనున్నది. పేద విద్యార్థులు కలలు సాకారం కానున్నాయి.
– రాజేశ్వర్యాదవ్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు