హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఎడ్సెట్ రెండో విడత సీట్లను శనివారం కేటాయించారు. కన్వీనర్ కోటాలో 9,593 సీట్లుండగా వెబ్ కౌన్సెలింగ్కు 8,338 విద్యార్థులు హాజరై, వెబ్ ఆప్షన్లు ఎంచుకొన్నారు. వీరిలో 6,223 మంది అభ్యర్థులు సీట్లు దక్కించుకొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 4లోపు ట్యూషన్ ఫీజు చెల్లించి, కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. మొదటి విడతలో 9,417 విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు.