హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ఎంసెట్ ఇంజినీరింగ్లో 13,139 సీట్లు మిగిలాయి. తుది విడత కౌన్సెలింగ్ ముగిశాక ఈ లెక్క తేలింది. సివిల్ మెకానికల్ కోర్సుల్లో 4,730 సీట్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో మరో 4,150 సీట్లు మిగిలాయి. ఇక సీఎస్ఈ, ఐటీ కోర్సుల్లో 3,777 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 83,766 బీటెక్ సీట్లుంటే, 70,627 (84.31శాతం) సీట్లు నిండాయి. సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లో గణనీయంగా సీట్లు మిగలడం గమనార్హం.
రెండో విడత కౌన్సెలింగ్లో 62,738 విద్యార్థులు సీట్లను కన్ఫర్మేషన్ చేసుకోగా,. తాజాగా 7,889 మంది విద్యార్థులు తుదివిడత కౌన్సెలింగ్లో సీట్లు దక్కించుకొన్నారు. వీరు ఈ నెల 11లోపు ఫీజు చెల్లించి సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలి. ఎంసెట్ మొదటి, రెండో, తుది విడుత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన వారు ఈ నెల 12లోపు సంబంధిత కాలేజీల్లో టీసీలు సమర్పించి ప్రత్యక్షంగా రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు.