జయశంకర్ భూపాపల్లి : బీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో(BRS party offi) చోరీ(Theft) జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడం, భూపాలపల్లి నియోజకవర్గంలో బీఅర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఓటమి చెందడంతో భూపాలపల్లిలోని పార్టీ కార్యాలయంలో సందడి తగ్గింది. కాగా, మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయం వెనుక నుంచి అద్దాలు పగలగొట్టి ఆఫీస్ లోని రెండు కంప్యూటర్లను దొంగిలించారు. మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి పీఏ వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.