యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి అలంకార
సేవోత్సవంలో భాగంగా గురువారం నృసింహస్వామి ఉదయం వటపత్రశాయి అలంకార సేవలో, రాత్రి హంసవాహనంలో
ప్రధానాలయ మాడ వీధుల్లో ఊరేగారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.