కుభీర్, మే 18 : ‘తెలంగాణ సర్కారు సంకల్పం గొప్పది. ఏటా హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం గొప్ప విషయం. ఫలితంగా అడవుల శాతం పెరుగుతున్నది’ అని ఉపాధి హామీ కేంద్ర బృందం సభ్యుడు ప్రొఫెసర్ వెంకట రవి కితాబిచ్చారు.
బుధవారం ఆయన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని రాంనాయక్ తండాలో ఉపాధి పనులను పరిశీలించారు. అనంతరం గిరిజనులతో కలిసి మొక్క నాటారు. తెలంగాణలో ఇప్పటికే అడవుల శాతం పెరిగిందన్నారు. మొక్కలు నాటడం అనేది మంచి ప్రక్రియ అని దీన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తే అన్ని విధాలా మేలు జరుగుతుందని సూచించారు.