నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 15: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్ట ణం బాపూజీనగర్లో అన్నదానం కార్యక్రమాన్ని ప్రా రంభించిన అనంతరం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలను తమ రాష్ర్టాల్లో నూ అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఉచిత విద్యుత్తు, రైతుబీమా, రైతుబంధు, పింఛన్లు, కల్యాణలక్ష్మి పథకాలు దేశ ప్రజల ను ఆకర్షిస్తున్నాయని వివరించారు. రాష్ట్ర సరిహద్దు ప్రా ంతాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమా ండ్ చేస్తున్నారని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో మహబూబాబా ద్ జిల్లా పెద్దవంగర, జనగామ జిల్లా దేవరుప్పులలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేశారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం, హంటర్ రోడ్డులోని ఏకశిల వృద్ధాశ్రమం, ప్రశాంత్నగర్లోని సహృదయ వృద్ధాశ్రమంలో చిన్నారులు, వృద్ధులకు కొత్త బట్టలు, పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. మహబూబ్నగర్ పట్టణం ఏనుగొండలోని రెడ్క్రాస్ అనాథ శరణాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ విద్యార్థులకు బ్యాగులు, పండ్లు పంపిణీ చేశారు. కరీంనగర్లోని తెలంగాణచౌక్లో నిర్వహించిన అన్నదానంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. గుత్తా వెంకట్రెడ్డి మోమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లగొండలోని లెప్రసీ హెల్త్సెంటర్ ఆవరణలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమానికి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు అన్నదానం, పండ్ల పం పిణీ చేపట్టారు. గూడేల్ల్లో కూడా కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆదివాసీలు సంబురంగా జరుపుకోవడం విశే షం. దక్షిణాఫ్రికాలోని జోహోనస్బర్గ్ మిడ్రాండ్లో టీఆర్ఎస్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు గుర్రాల నాగరాజు, టీఆర్ఎస్ ఎన్నారై కమిటీ చారిటీ ఇంచార్జి శ్రీధర్రెడ్డి, అరవింద్, విష్ణు జైగుండా, రేపాల శ్రీనివాస్, సౌజన్రావు, రాంబాబు అన్నదానం చేశారు.
50 దేశాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు: మహేశ్ బిగాల
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను దాదాపు 50 దేశాల్లో ఘనంగా నిర్వహించనున్నట్టు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా దేశాల్లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ఆధ్వర్యంలో అన్నదానం, రక్తదాన శిబిరాలు, సర్వమత ప్రార్థనలు, మొకలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.