మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి , మే 4 : తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈద్గా మసీద్ ప్రాంగణంలో ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు. అనంతరం వనపర్తిలోని క్యాంప్ కార్యాలయంలో కొవిడ్ సేవలపై వైద్యాధికారులతో సమీక్షించారు. జిల్లా కేంద్రం లో రూ.1.16 కోట్లతో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.