హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లిలోని రంగసముద్రం చెరువు దీనావస్థపై ఆ గ్రామ రైతు సంఘం పోరాటం కొనసాగుతూనే ఉన్నది. ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో తొలుత ఫిర్యాదు చేశారు. కొందరు రియల్టర్లు రంగసముద్రంను చెర పట్టడంతో భూగర్భజలాలు గణనీయంగా పడిపోతూ గ్రామం ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని ఫిర్యాదులో ఆవేదన వ్యక్తంచేశారు.
అనంతరం సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా గిరికొత్తపల్లి గ్రామ రైతు సంఘం పేరిట ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, రంగసముద్రం చెరువును పునరుద్ధరించి, గ్రామాన్ని ఆదుకోవాలని కోరారు.