BRS | అమరచింత, డిసెంబర్ 7: బీఆర్ఎస్ నేతల వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ధర్మాపూర్లో బీఆర్ఎస్ నేతలు హరిజన గోపి, హరిజన సోమన్నల రెండు ఆటోలు, స్కూటీని బుధవారం అర్ధరాత్రి తమ ఇంటి ముందు నిలిపారు. వాటిని గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ శివారులోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు.
దీంతో వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. గురువారం ఉదయం గమనించిన బాధితులు లబోదిబోమని విలపించారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు సీఐ రత్నం సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమాదు చేసి క్లూస్ టీంతో దర్యాప్తు జరిపిస్తామని సీఐ తెలిపారు.