హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులను మోసం చేసే పాలకులపై యువత నిరంతరం పోరాటాలు చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమలై రామన్ పిలుపునిచ్చారు.
గురువారం హైదరాబాద్లోని సత్యనారాయణరెడ్డి భవన్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలై మాట్లాడుతూ.. యువతకు ఉపాధి హామీ కల్పించలేని కేంద్రం తీరు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కే ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.