హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. రిజర్వేషన్ల విధానంపై కోర్టు కేసులు, వివాదాల నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు అ మలు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమశాఖ సెక్రటరీ వాకాటి కరుణ ఇటీవల జీవో ఇ చ్చారు. దీంతో మహిళలకు కేటాయించే 33 శాతం రిజర్వేషన్లు హరిజాంటల్ విధానంలోనే ఉండనున్నాయి.