పటాన్చెరు టౌన్, జూన్ 19: సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన 17 ఏండ్ల బాలుడు వెంకటేశ్ సైకిల్పై కశ్మీర్ వరకు సాహసయాత్ర చేశాడు. లఢక్కు చేరుకొని టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను రెపరెపలాడించాడు. సీఎం కేసీఆర్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చిత్రాలతో కూడిన గులాబీజెండాను ప్రదర్శించి టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపాడు. ఆదివారం కశ్మీర్లోని లఢక్-ఖార్దుంగ్ లాపాస్ వద్ద వెంకటేశ్ ‘జై తెలంగాణ, జై టీఆర్ఎస్’ నినాదాలు చేశాడు. పటాన్చెరు నుంచి కశ్మీర్కు 26 రోజుల్లో చేరుకొన్నాడు. సైకిల్పై 2,600 కిలోమీటర్లు ప్రయాణించి లఢక్ చేరకొన్నాడు. సముద్ర మట్టానికి 18,380 అడుగుల ఎత్తులో టీఆర్ఎస్ జెండాను విజయగర్వంతో ప్రదర్శించాడు.