పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచురాజ్ పల్లి సమీపంలో గురువారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంథని మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన అడ్డూరి వంశీ (22) విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేయించడానికి ట్రాక్టర్ పై వెళ్తున్నాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కూచురాజుపల్లి సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడటంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వంశీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.