యాదాద్రి, సెప్టెంబర్ 13 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో భక్తులను ఆకట్టుకొనే తంజావూర్ చిత్రపటాన్ని ఆలయ అధికారులు మంగళవారం అమర్చారు. ప్రధానాలయంలోని గరుత్మంతుడి ఆలయం పక్కన క్యూలైన్ల ప్రాంతంలో తంజావూర్ స్వర్ణవర్ణపు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.
లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాన్ని ప్రతిబింబిస్తూ తీర్చిదిద్దిన ఈ పెయింటింగ్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నది. గతంలో అమర్చిన లక్ష్మీ నరసింహస్వామివారి చిత్రపటాన్ని తొలగించి, అదే ప్రాంతంలో స్వామివారి కల్యాణతంతును సూచించే ఈ చిత్రపటాన్ని అమర్చారు.