హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు, టీచర్ల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ గడువును మే 31నుంచి జూన్ 30 వరకు పొడిగించాలని టీజీహెచ్ఎంఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
శనివారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ముఖ్య సలహాదారు పర్వతి సత్యనారాయణ సీఎస్కు వినతిపత్రం సమర్పించారు.