హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగుల ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) విజ్ఞప్తిచేసింది.
ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్, ప్రధానకార్యదర్శి కోడూరి ప్రకాశ్ గురువారం టాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావుకు వినతిపత్రం అందజేశారు. త్వరలో జరిగే బోర్డు సమావేశంలో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.